అలీపై బూతులతో నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్ : మా మధ్య ఇది మాములే అంటూ కవరింగ్

అలీపై బూతులతో నోరు పారేసుకున్న రాజేంద్రప్రసాద్ : మా మధ్య ఇది మాములే అంటూ కవరింగ్

అగ్ర దర్శకుడు SV కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుక (జూన్ 1న) పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ఆమని, ఇంద్రజ, లయ, అలీ, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, చంద్రబోస్, రవళి, రోజా, మురళీమోహన్, తదితరులు పాల్గొని ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

అయితే, ఈ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నోరు అదుపు తప్పి మాట్లాడి మరోసారి వైరల్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్య వ్యాఖ్య చేశారు.

తన స్పీచ్లో భాగంగా మాట్లాడుతూ.. “ఏరా అలీగా.. ఎక్కడ ఆ ల******కు.. ఇటురా బే” అని నోరు అదుపు తప్పి మాట్లాడారు. ఆ క్షణంలో అలీ నవ్వినట్టు అనిపించినా.. లోపల బాగా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇపుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజేంద్ర ప్రసాద్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నటించడం ఒక్కటే వస్తేనే సరిపోదు.. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై ఈ నటుణ్ని సినిమా ఈవెంట్స్ కు పిలిచేందుకు ఆలోచిస్తే బాగుంటుంది అని మరికొందరు అంటున్నారు. 

ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ తన వాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కమెడియన్ అలీని ల****కు అని దూషించడంపై స్పందిస్తూ.. తాను ఎప్పుడైనా సరదాగా అలా మాట్లాడతానని.. అది అవతల వాళ్ళు తీసుకునే సంస్కారాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.

చప్పట్లు కొట్టరా..?

అలాగే తనకు ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని, అది తీసుకోవడం కోసం విజయవాడ వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఆయిన, అక్కడ ఉన్నవాళ్లు ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవడంతో మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడి తనపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని కోల్పోయాడు. 

“చప్పట్లు కొట్టరా.. బుద్ది ఉందా లేదా.. ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టారా.. బ్రెయిన్ పోయిందా” అని చెప్పి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కూడా చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్టు లెక్క అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇలా ఏం మాట్లాడుతుండో తనకే అర్ధమవ్వట్లేదు అన్నట్టుగా వేదికలపై రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తిస్తున్నాడు. 

రాబిన్ హుడ్ ఈవెంట్‍లో.. 

ఇటీవల కాలంలో రాజేంద్రప్రసాద్ తరుచు ఏదో విధంగా తన నోటిదురుసుతో అదుపు తప్పి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. " మా డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను తీసుకొచ్చారు. ఆయన క్రికెట్ ఆడవయ్యా అంటే, పుష్ప స్టెప్స్ వేశాడు. దొంగ ము**కొడుకు.. వీడు మామూలోడు కాదు. రేయ్ వార్నరూ ..బీ వార్నింగ్ " అని మాట్లాడి తీవ్ర విమర్శలు వచ్చేలా మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.

ఆ వెంటనే క్షమాపణలు చెబుతూ..  "ఐ లవ్ డేవిడ్ వార్నర్.. నాకు అతడి క్రికెట్ అంటే చాలా ఇష్టం..డేవిడ్ వార్నర్ కి తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని, అలాగే మా యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమని తెలిపాడు..  మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయామని ఏదేమైనా ఈ జరిగిన సంఘటనకిగానూ మీరెవరైనా ఫీల్ అయ్యుంటే సారీ.. నేను కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అలీపై నోరు జారీ, మరోసారి తన పెద్దరికంపై గౌరవం పోయేలా చేసుకున్నాడు.