ప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్

ప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్

‘ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….’ అంటూ ట్వీట్ చేసి సినీవర్గాలలో కుతూహలం పెంచాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. టాలీవుడ్ లో పెళ్లికాని హీరోలందరూ సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్రూప్ నుంచి మొన్నా మధ్య హీరో నిఖిల్ లెఫ్ట్ అయ్యారు. ‘ఐ యామ్ గెట్టింగ్ ఎంగేజ్డ్.. మిస్ యూ గైస్’అని మెసెజ్ పెట్టి లెఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే పెళ్లిపీఠలెక్కాడు. కొన్ని రోజుల తర్వాత హీరో నితిన్ కూడా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యాడు. ‘నేను ఇక మీదట భీష్మాను కాదు. మరోకరితో మింగిల్ అవుతున్నాను. సైనింగ్ ఆఫ్’ అంటూ మెసెజ్ పెట్టి నితిన్ లెఫ్ట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బల్లాలదేవ రానా లైన్ లోకి వచ్చాడు. ‘ఇది ఒక హఠాత్ పరిణామం.. సారీ రా అబ్బాయిలు’ అంటూ మెసెజ్ పెట్టి ఆయన కూడా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యాడు.

ఇప్పుడు తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ‘ఇట్స్ షో టైం.. సారీ.. ప్రభాస్ అన్నా’అని మెసెజ్ పెట్టి తాను కూడా లెఫ్ట్ అయ్యాడు. పైన చెప్పిన హీరోలందరూ.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన కొన్ని రోజుల్లోనే పెళ్లిపీఠలెక్కారు. అంటే.. సాయిధరమ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్నాడా అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ మెసెజ్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే సోమవారం ఉదయం 10 గంటల వరకు వేచి చూడండి అంటూ హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. దాంతో సాయిధరమ్ రేపు తన పెళ్లి గురించి చెప్తాడా లేక మరేదైనా కొత్త సినిమా గురించి చెప్తాడా అని సినీ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.

For More News..

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు