ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే రైటర్

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసే రైటర్

షార్ట్‌‌‌‌ ఫిలింస్‌‌‌‌తో కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి హీరోగా ఎదిగిన సుహాస్... త్వరలో ‘రైటర్‌‌‌‌‌‌‌‌ పద్మభూషణ్‌‌‌‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సుహాస్‌‌‌‌ మాట్లాడుతూ ‘థియేటర్‌‌‌‌‌‌‌‌లో విడుదలవుతున్న నా ఫస్ట్ మూవీ ఇది. అందుకే ఓవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు నెర్వస్‌‌‌‌గానూ ఉంది. ఇదొక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉంటూనే ఎక్సైటింగ్‌‌‌‌గా ఉంటుంది. ముఖ్యంగా ట్విస్ట్‌‌‌‌లు ఇంప్రెస్ చేస్తాయి. క్లైమాక్స్‌‌‌‌కు అందరూ కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులంతా కచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ‘ఛాయ్ బిస్కెట్’లో షార్ట్ ఫిల్మ్‌‌‌‌తో మొదలై ఇప్పుడు అదే సంస్థలో సినిమా చేయడం ఆనందంగా, గర్వంగా వుంది. చిన్న పాత్రలు చేస్తే చాలనుకున్నా. కానీ ఇప్పుడు చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేయడంపై ఫోకస్ పెట్టా. గీతా ఆర్ట్స్ 2లో ఓ సినిమాతో పాటు ‘ఆనందరావు అడ్వంచర్స్’ అనే మరో సినిమా చేస్తున్నా’ అన్నాడు.