Ananya Nagalla: తిరుమల శ్రీవారి దర్శనం కొరకు..కాలినడకన టాలీవుడ్ హీరోయిన్

Ananya Nagalla: తిరుమల శ్రీవారి దర్శనం కొరకు..కాలినడకన టాలీవుడ్ హీరోయిన్

పల్లెటూరు కథా చిత్రం మల్లేశంతో సినీ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల(Ananya Nagalla). ఆ వెంటనే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో నటించే అవకాశం రావడంతో..బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఇండస్ట్రీలో అంత అనుకున్నట్టు జరగదు సుమా! అనే పాయింటే తనకి ఎదురైంది.ఇక పెద్ద సినిమాల్లో ఛాన్స్లు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో సోషల్ మీడియాలో తనదైన గ్లామర్తో, అచ్చమైన తెలుదనంతో కుర్రాళ్లకు..డైరెక్టర్స్కు చేరువయ్యే పనిలో ఉంది.

Also Read :అదేంటి బామ్మర్ది అనేశారు.. అనుపమ పోస్ట్పై నెటిజన్స్ రియాక్షన్

రీసెంట్ గా అనన్య తంత్ర అనే హారర్ మూవీతో ఆడియన్స్ కు ముందుకు వచ్చింది. ఈ మూవీ కలెక్షన్స్ ను కూడా అనుకున్నదానికంటే గట్టిగానే రాబడుతుంది. దీంతో చాలా రోజుల తరువాత హిట్ దక్కడంతో..శ్రీవారికి మొక్కు తీర్చుకోవాలని తిరుమలకు వెళ్లింది.

అంతేకాదు కాలినడకన ఏడు కొండలు ఎక్కింది. ఒంటరిగా మెట్లు ఎక్కుతున్న వీడియో చూస్తుంటే, సింపుల్ గా తాను ,మాత్రమే నడక మార్గంలో వెళుతూ కనిపిస్తోంది. దీంతో తిరుమలకి ఒంటరిగా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..తాంత్రిక శాస్త్రంలో ఊహ‌కు అంద‌ని ఎన్నో ర‌హ‌స్యాలున్నాయ‌నే పాయింట్‌తో డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి తంత్ర సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా కథ కొత్తగా ఉండటంతో జనాల ఆదరణ లభించింది.ప‌ల్లెటూళ్ల‌లో క్షుద్ర‌పూజ‌లు, చేత‌బ‌డులు ఎలా ఉంటాయ‌న్న‌ది ఆసక్తిగా చూపించారు.