అదో చెత్త సినిమా.. చెప్పేవాళ్లు చేసి చూపించాలి.. మాధవి లత షాకింగ్ కామెంట్స్

అదో చెత్త సినిమా.. చెప్పేవాళ్లు చేసి చూపించాలి.. మాధవి లత షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటి మాధవి లత(MAdhavi latha) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల తెలుగులో విడుదలైన రెండు పెద్ద సినిమాలను టార్గెట్ చేస్తూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ రెండు సినిమాలపై డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి యాంకర్ మాధవి లతను ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఇటీవలే ప్రభాస్(Prabhas) చేసిన ఆదిపురుష్(Adipurush) సినిమా చూశాను. అది ఒక బ్లండర్, డిజాస్టర్, డర్టీ మూవీ. కేవలం హిందువులని డివైడ్ చేయడానికి మాత్రమే ఆ సినిమాను చేశారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాధవి లత. 

ఇక రీసెంట్ బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth kesari) గురించి మాట్లాడిన ఆమె.. స్టార్ హీరోల చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం మంచి కాన్సెప్ట్ కానీ.. హీరోయిన్ ని గ్లామర్ గా చూపిస్తూ.. ఎలాంటి డైలాగ్స్ చెప్పకూడదు. అలా చేస్తే.. చేసేది శివపూజలు దూరేది ఇంకేదో అంటారు కదా అలా ఉంటుంది. ఇక సినిమాల్లో డైలాగ్స్ చెప్పేవాళ్ళు నిజ జీవితంలో కూడా పాటిస్తే బాగుటుంది.. అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మాధవి లత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కామెంట్స్ పై బాలకృష్ణ, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.