పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తిరగబడరా స్వామి' సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వీ మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని.. ఆమె కూడా తనను బెదరిస్తుందని జూలై 5వ తేదీన లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్వీ కుటుంబం నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. తనను చంపుతాం అని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది.

దీనిపై ఇప్పటికే రాజ్ తరుణ్ స్పందించారు. తాజాగా నటి మాల్వీ తనపై లావణ్యా తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాల్వీ..  "నాకు రాజ్ తరుణ్ తో ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు సహచర నటుడు మాత్రమే. లావణ్యతో నాకు పరిచయం లేదు. లావణ్యను నేను బెదిరించలేదు. షూటింగ్ పూర్తై ఆరు నెలలు అవుతోంది.. అప్పటి నుంచి నేను రాజ్ తరుణ్ తో టచ్ లో లేను. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతీ హీరోయిన్ ను లావణ్య అవమానిస్తుంది. రాజ్ తరుణ్, లావణ్య మధ్య గొడవలోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. లావణ్య నాకు చేసిన మెసేజ్ లు, కాల్ లిస్ట్ ను పోలీసులకు ఇస్తా" అని చెప్పారు.