వరుస సినిమాలతో శ్రియ శరణ్ బిజీ

వరుస సినిమాలతో శ్రియ శరణ్ బిజీ

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవయ్యేళ్లు దాటినా ఇప్పటికీ ఇంటరెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తూ సత్తా చాటుతోంది శ్రియ శరణ్. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు సినిమాలున్నాయి. వాటిలో ‘దృశ్యం 2’ బాలీవుడ్ రీమేక్ ఒకటి. అజయ్ దేవగన్ హీరోగా అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 18న గ్రాండ్‌‌గా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. నిన్న టీజర్‌‌‌‌ని కూడా వదిలారు. ఫస్ట్ పార్ట్‌‌లో జరిగిన సంఘటనల్ని కూర్చి, సెకెండ్ పార్ట్‌‌ మీద ఆసక్తిని పెంచేలా ఈ వీడియోని కట్‌‌ చేశారు. పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌కి పూర్తి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమా విషయంలో చాలా ఎక్సయిటవుతోంది శ్రియ. ఇక ఆమె నటించిన ‘మ్యూజిక్ స్కూల్’ మూవీ కూడా రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. మూడు నెలల క్రితమే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మ్యూజిక్ బేస్డ్ మూవీ కావడం, ఇళయరాజా సంగీతం అందిస్తూ ఉండటంతో మంచి అంచనాలున్నాయి.

ఇక ఉపేంద్రతో కలిసి ‘కబ్జా’లోనూ నటిస్తోంది శ్రియ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీలో చాలా డిఫరెంట్‌‌ రోల్‌‌ పోషిస్తోందామె. ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ని కూడా త్వరలో ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తానికి శ్రియ జోరు అయితే ఇప్పటికీ తగ్గలేదు. సెలెక్టివ్‌‌గా చేస్తున్నా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో మాత్రమే కనిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.