
హిండెన్ బర్గ్ వివాదంలో చిక్కుకుని అంతర్జాతీయంగా విమర్శల పాలైన అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా LPG దిగుమతులపై అమెరికా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ టారిఫ్ ఆంక్షలకు విరుద్ధంగా అదానీ పోర్ట్స్ ద్వారా ఎల్పీజీ గ్యాస్ రవాణా జరిగిందనే, అమెరికా దీనిపై విచారించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
ఇరాన్ నుంచి ఎల్పీజీని ఇండియాకు తరలించారని, అందుకోసం గుజరాత్ లో ఉన్న ముంద్రా పోర్ట్ ద్వారా దిగుమతి జరిగిందని వాల్ స్ట్రీట్ జనరల్ కథనంలో పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై అదానీ ఎంటర్ప్రైజెస్ కొట్టిపారేసింది. ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించలేదని అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.
ఇరాన్ నుంచి ముంద్రా పోర్టుకు ట్యాంకర్స్ రవాణా జరిగినట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు పేర్కొంది. ముంద్రా పోర్టు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఆధ్వర్యంలో ఉంది. గల్ఫ్ కంపెనీల నుంచి ఎల్పీజీ రవాణా జరిగిందని, యూఎస్ ఆంక్షలను ఉల్లంఘించారని అమెరికా ఆరోపిస్తోంది.
గత నెల యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్ నుంచి ఆయిల్, ఎల్పీజీ, పెట్రోకెమికల్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం నిషేధిస్తూ నిబంధనలు విధించారు. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ ద్వారా దిగుమతులు జరిగినట్లు ఆరోపణలు రావడం గమనార్హం.