అదానీ గ్రూప్‌‌‌‌కు రూ. 43,688 కోట్ల లాభం.. 47 శాతం గ్రోత్‌‌‌‌

అదానీ గ్రూప్‌‌‌‌కు రూ. 43,688 కోట్ల లాభం.. 47 శాతం గ్రోత్‌‌‌‌

న్యూఢిల్లీ :  అదానీ గ్రూప్ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌లు, వడ్డీలు చెల్లించకముందు వచ్చిన ప్రాఫిట్‌‌‌‌)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ.43,688 కోట్లకు చేరుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌తో పోలిస్తే 47 శాతం వృద్ధి సాధించింది.  కోర్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ (కరెంట్‌‌‌‌, సిమెంట్‌‌‌‌, పోర్ట్స్, మైనింగ్‌‌‌‌ వంటివి) బిజినెస్‌‌‌‌ల నుంచి రూ. 37,379 కోట్ల ఇబిటా వచ్చిందని, ఇది 52 శాతం వృద్ధి చెందిందని తెలిపింది.  కీలకమైన ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌‌‌‌లు స్టేబుల్‌‌‌‌గా ఉన్నాయని, మొత్తం గ్రూప్ కంపెనీల ఇబిటాలో 80 శాతం వీటి నుంచే వచ్చిందని  అదానీ గ్రూప్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. అదే గత ఏడాది కాలంలో రూ.71,253 కోట్ల ఇబిటా వచ్చిందని, ఇది 2018–19 లో వచ్చిన  ఇబిటాతో పోలిస్తే  మూడు రెట్లు  ఎక్కువని వెల్లడించింది.

దేశ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడంపై ఫోకస్ పెడుతున్న కీలక వ్యాపారాలు  మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 45,895 కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉందని తెలిపింది.  అదానీ గ్రూప్ అనేక బిజినెస్‌‌‌‌లు చేస్తోంది.  లాజిస్టిక్స్ ( పోర్ట్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లు,షిప్పింగ్‌‌‌‌, రైల్‌‌‌‌), రిసోర్సెస్‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌ అండ్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్యాస్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌, ఆగ్రో (కమొడిటీస్‌‌‌‌, వంటనూనె, ఫుడ్ ప్రొడక్ట్స్‌‌‌‌, కోల్డ్ స్టోరేజ్‌‌‌‌), రియల్ ఎస్టేట్‌‌‌‌, పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ ఫైనాన్స్‌‌‌‌, డిఫెన్స్  రంగాల్లో వ్యాపారం చేస్తోంది. మరిన్ని సెక్టార్లకు విస్తరిస్తోంది.