అడివి శేష్.. అనగానే ‘క్షణం’ సినిమా మొదలు ‘హిట్ 2’ వరకూ థ్రిల్లర్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. ‘మేజర్’తో సహా తను నటించిన సినిమాల్లో ఎంతోకొంత ప్రేమకథ ఉంటుంది కానీ పూర్తి స్థాయి లవ్స్టోరీస్లో నటించడం మాత్రం చాలా తక్కువ.
అయితే ఈసారి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్స్కి బ్రేక్ ఇచ్చి లవ్ స్టోరీలో నటిస్తానంటున్నాడు శేష్. ప్రస్తుతం ‘గూఢచారి 2’లో నటిస్తున్నాడు. ఇది కూడా ఓ స్పై థ్రిల్లర్. దీని తర్వాత ప్రేమకథ చిత్రంలో నటించబోతున్నా అంటూ శేష్ ట్వీట్ చేశాడు. రానున్న కొద్ది నెలల్లో దీనిపై అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పాడు. సో త్వరలోనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో శేష్ను చూడొచ్చు.