సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ పేదలకు వరం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ పేదలకు వరం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట/చందుర్తి, వెలుగు: సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రం మండల పరిషత్ ఆఫీస్‌‌లో 56 మంది, చందుర్తి మండలకేంద్రంలో 89 మందికి, రుద్రంగిలో 20 మంది లబ్ధిదారులకు  సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌ ద్వారా, ఎల్‌‌వోసీల ద్వారా ఇప్పటివరకు రూ.20 కోట్లు అందజేసినట్లు చెప్పారు. 

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, చింతపంటి రామస్వామి, లీడర్లు గంగాధర్, నాగం కుమార్‌‌‌‌, గొట్టే ప్రభాకర్‌‌‌‌, రమేశ్‌‌రెడ్డి, రుక్మిణి, చారి, తదితరులు పాల్గొన్నారు.