మారుమూల గిరిజన గ్రామాల్లోని సర్కార్ బడుల్లో టీచర్ల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి ‘బి’ గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 49 మంది విద్యార్థులు చదువుతున్నారు.
వీరందరికీ ఒకే తరగతి గది, ఒక్క టీచర్ మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల క్రితం స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లలో ఒకరు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో ఒక్కరే విద్యార్థులకు బోధిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఒక్క టీచర్ సెలవు పెడితే బడికి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
