- మై క్యూర్ యాప్లో బయటపడ్డ బాగోతం
- స్పాట్కు వెళ్లకుండానే ఫిర్యాదులకు ఫేక్ పరిష్కారాలు
- ఆఫీసులోనే కూర్చొని ‘బ్లాంక్ ఫొటో’ అప్లోడ్
- సాల్వ్ చేశామంటూ రిపోర్ట్
చందానగర్, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కమిషరేట్ పరిధిలో అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాల అలవాటు అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. ఎక్కడ అక్రమ నిర్మాణం జరుగుతోంది? పర్మిషన్ తీసుకున్నది ఎంతవరకు? కడుతున్నది ఎంతవరకు? అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిశీలించాల్సి ఉండగా, ఆ పని ఎప్పుడో మర్చిపోయారు. ఎవరైనా సమాచారం ఇస్తే అక్రమ నిర్మాణదారులతో మాట్లాడి సెట్ చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
పైగా, ఎవరైనా ఫలానా చోట అక్రమ నిర్మాణం జరుగుతోందనో.. లేక సమస్య ఉందనో ఫిర్యాదు చేస్తే కనీసం ఆఫీసు నుంచి కాలు కూడా కదపడం లేదు. ఇటీవల కొందరు మై క్యూర్యాప్తోపాటు ప్రజావాణి గ్రీవెన్స్లో సమస్యలపై ఫిర్యాదు చేస్తే అధికారులు ఫేక్రిపోర్ట్స్పెట్టి ఆ కంప్లయింట్స్ను క్లోజ్చేశారు. కనీసం ఘటనాస్థలికి వెళ్లకుండానే ‘సాల్వ్చేశాం’ అని రాసేశారు. దీనికి సాక్ష్యంగా ఏమీ కనిపించని బ్లాంక్ఫొటోలు అప్లోడ్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సదరు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మై క్యూర్ యాప్లో ఫిర్యాదు చేస్తే..
మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధ్యం, ఎంటమాలజీ, ఎలక్ట్రికల్, వెటర్నరీ, పార్కింగ్, ఇంజినీరింగ్, ఫుడ్సేఫ్టీ, చెరువులు, రెవెన్యూ, ఇతర సమస్యలు ఉంటే మై క్యూర్యాప్లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను వివరిస్తూ ఫొటో, లొకేషన్అప్లోడ్ చేస్తే అధికారులు లొకేషన్కు వెళ్లి పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నామో తెలియజేస్తూ యాప్లోని గ్రీవెన్స్లో అప్లోడ్ చేయాలి.
చేస్తున్నదేమిటి ?
మై క్యూర్యాప్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. అయితే, సంబంధిత టౌన్ప్లానింగ్ఆఫీసర్స్పాట్కు వెళ్లి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి, ఏ చర్య తీసుకున్నామో తెలియజేస్తూ ఫొటోలు పెట్టకుండా అఫీసులోనే కూర్చొని కథ మొత్తం నడిపిస్తున్నారు. ఏదో ఒక బ్లాంక్ఫొటో అప్లోడ్చేసి ఫిర్యాదు క్లోజ్ చేస్తున్నారు.
ఇవీ ఉదాహరణలు
* గచ్చిబౌలి వినాయక్నగర్లోని ప్లాట్నెంబర్62లో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఓ ఫిర్యాదు వచ్చింది. అయితే, మై క్యూర్యాప్లో టౌన్ప్లానింగ్ఆఫీసర్సమస్య పరిష్కరించినట్లు ఒక బ్లాంక్ఫొటో అప్లోడ్చేశారు. సమస్య గచ్చిబౌలిలో ఉంటే ..మాదాపూర్కావూరి హిల్స్లో ఫొటో అప్లోడ్ చేసినట్లు గూగుల్కోఆర్డినేషన్లో తేలింది.
* మియాపూర్ మదీనగూడ రామకృష్ణనగర్లోని బాబాయ్హోటల్వెనక అక్రమ షెడ్నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు వచ్చింది. ఇది మియాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ఆఫీసర్కు వెళ్లగా స్పాట్కు వెళ్లకుండానే అటెండ్అయినట్లు, అక్రమ షెడ్నిర్మాణానికి నోటీసులిచ్చినట్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే, ఈ పనంతా మియాపూర్సర్కిల్ఆఫీసులో కుర్చొని బ్లాంక్ఫొటో అప్లోడ్చేసినట్టు గూగుల్కో ఆర్డిరేషన్లో బయటపడింది.
* మియాపూర్పటేల్ చెరువు బండ్బఫర్జోన్ఆక్రమించి కృషినగర్లో రెండు నిర్మాణాలు జరుగుతున్నాయని కంప్లయింట్రాగా, మియాపూర్టౌన్ప్లానింగ్ఆఫీసర్ఈ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని ఫీల్డ్కు వెళ్లకుండానే సర్కిల్ఆఫీసులో గూగుల్మ్యాప్తో కూడిన బ్లాంక్ఫొటో అప్లోడ్చేశారు. సమస్యను పరిష్కరించినట్లు గ్రీవెన్స్క్లోజ్చేశారు.
ఫీల్డ్ విజిట్కు వెళ్తే ఆ ఘటన జరిగేదా?
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్కు వెళ్లి నిర్మాణ దశలోనే అక్రమాలను గుర్తిస్తే అంజయ్య నగర్ లాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అవి పేకమేడల్లా కూలి ప్రాణాలు తీస్తున్నాయి. ఐటీ కారిడార్లో అద్దెలు, హాస్టళ్లకు భారీ డిమాండ్ఉండడంతో చాలామంది బిల్డర్లు, యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు.
తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో నాసిరకంగా ఐదు, ఆరు, ఏడు అంతస్థుల వరకు కడుతున్నారు. అవి కూలుతుండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటికైనా అధికారులు ఫీల్డ్విజిట్చేసి ఇలాంటి కట్టడాలను గుర్తించి అవి ఏ స్థితిలో ఉన్నాయో చూసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
