తల్లిదండ్రులూ ఫోన్ల వాడకం తగ్గించాలి : గౌస్‌​ ఆలం

తల్లిదండ్రులూ ఫోన్ల వాడకం తగ్గించాలి : గౌస్‌​ ఆలం

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  చిన్నారులతో పాటు తల్లిదండ్రులు సైతం స్మార్ట్​ ఫోన్​ల వాడకాన్ని తగ్గిస్తే ఫలితాలు ఉంటాయని జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం అన్నారు.  మొబైల్​ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్​, మాస్టర్​మైండ్​ పాఠశాలల ఆధ్వర్యంలో  మంగళవారం నిర్వహించిన 2కె రన్‌ను ఎస్పీ ప్రారంభించారు.  

ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్​ చౌక్​ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రన్​ నిర్వహించారు. స్మార్ట్​ ఫోన్లను అధికంగా వాడడంతోనే అనర్థాలు జరుగుతాయన్నారు.  ఫోన్​ల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.  కార్యక్రమంలో డైరెక్టర్​ సాయిని రవి, ప్రిన్సిపల్​ బిన్నికౌర్​ అహ్లువాలియా, పూనమ్​ రతన్​, ప్రణవ్​, స్వప్న, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.