
ఆదిపురుష్ నుంచి ‘జైశ్రీరామ్..’ అంటూ ఓ లిరికల్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘చార్ధామ్ వెళ్లలేకపోతున్నారా.. ప్రభువు శ్రీరామ్ను స్మరించుకుంటే చాలు’ అంటూ ప్రభాస్ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ కొత్త పోస్టర్కు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పటివరకు విడుదల చేసిన లుక్స్ కన్నా ఇది పవర్ఫుల్ లుక్ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా కనిపించనున్నారు. జూన్ 16న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.