ఆదిపురుష్ నుంచి ఇంకో టీజర్...!

ఆదిపురుష్ నుంచి ఇంకో టీజర్...!

ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్ . రామాయణం అధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నాడు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులతో పాటుగా సినీ లవర్స్ ను తీవ్రనిరాశకు గురిచేసింది. అంతేకాకుండా పలు వివాదాలకు కూడా దారితీసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా రెండో టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తుందట. ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటువ్వకుండా అందరనీ ఆకట్టుకునే విధంగా టీజర్‌ను కట్‌ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. కాగా ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.