
ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన కొన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ వార్త తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ డిజపాయింట్ అవుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని మే 9న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగా పలు చోట్ల థియేటర్స్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.
అంతేకాదు.. ఈ సినిమాని 3D లో తెరకక్కించిన కారణంగా త్రీడీ స్క్రీన్ లలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన థియేటర్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్స్ దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్దామయ్యారు. అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్ ని ముందుగా రిలీజ్ చేద్దాం అనుకున్న కొన్ని థియేటర్స్ లో క్యాన్సిల్ చేశారట. కారణం.. ఆ థియేటర్స్ లో 3D స్క్రీన్స్ లేకపోడమే అని తెలిపారు మేకర్స్. షోస్ క్యాన్సిల్ చేసిన లిస్టుని కూడా రిలీజ్ చేశారు.
దీంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అవుతున్నారు. ఇక ఈ ట్రైలర్ మే 9న సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనుండి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.