
రెబల్స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న పీరియాడికల్ సినిమా ‘ఆదిపురుష్’. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్ తరచూ వివాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చౌకబారు వీఎఫ్ఎక్స్ వాడారంటూ గతంలో ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దీంతో ఈ విషయంపై మేకర్స్ దృష్టి పెట్టారు. దీంతో సినిమా మరింత ఆలస్యం కానుంది.
తాజాగా వీఎఫ్ఎక్స్ పార్ట్ను మార్చిన అప్డేటెడ్ టీజర్ విడుదలైంది. దీనిపై నెటిజన్లు పాజిటివ్గానే స్పందిస్తున్నారు. గతంలో ఉన్న విజువల్స్ తో పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా రియలిస్టిక్గా ఉందంటూ కితాబిస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లకు మాత్రం క్వాలిటీ మార్చిన టీజర్పై అంత సంతృప్తి చెందడంలేదు.
కలర్ గ్రేడింగ్, వీఎఫ్ఎక్స్ పరంగా చేసిన మార్పులు బాగున్నా క్రియేటివ్ వర్క్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కొత్త అప్డేట్తో ఆదిపురుష్ మరోసారి ట్విట్టర్ ట్రెండింగ్గా మారింది. ఈ ఏడాది జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.