రూ.5వేల కోట్లతో ఆదిత్య బిర్లా ​ జ్యుయెలరీ బిజినెస్​

 రూ.5వేల కోట్లతో ఆదిత్య బిర్లా ​ జ్యుయెలరీ బిజినెస్​

న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్​ రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బ్రాండెడ్​ రిటెయిల్​ జ్యుయెలరీ బిజినెస్​లోకి అడుగుపెడుతోంది. నోవెల్ జ్యుయెల్స్​ పేరుతో ఈ కొత్త బిజిఎస్​లోకి ఎంటరవుతున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్​ ప్రకటించింది. కొత్త గ్రోత్​ ఇంజిన్స్​ కోసం గ్రూప్​ చూస్తోందని, అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ కన్జూమర్​ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్​ చైర్మన్​ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. లైఫ్ స్టయిల్​రిటెయిలింగ్​లో గ్రూప్​కు ఉన్న అనుభవం ఈ కొత్త బిజినెస్​కు సాయపడుతుందని చెప్పారు.

దేశంలోని ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయని, దీంతో వారి కొనుగోళ్ల అభిరుచులు–అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి డిజైన్స్​, హై క్వాలిటీ జ్యుయెలరీని ఇష్టపడటం ఎక్కువవుతోందని బిర్లా వివరించారు. దేశంలోని పెద్ద గ్రూపులు టాటా, రిలయన్స్​ఇప్పటికే రిటెయిల్​ జ్యుయెలరీ బిజినెస్​లో ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్​ ఇటీవలే పెయింట్స్​, బిల్డింగ్​ మెటీరియల్స్​బీ2బీ ఈ–కామర్స్​ రంగాలలోనూ ప్రవేశించింది. దేశపు జీడీపీలో జెమ్స్​ అండ్​ జ్యుయెలరీ మార్కెట్​7 శాతాన్ని సమకూరుస్తోంది. అంతేకాకుండా, 2025 నాటికి ఈ మార్కెట్​ సైజు 90 బిలియన్​ డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయి.