ఆదిత్య ఎల్ 1 అప్డేట్.. భూమి ప్రభావాన్ని దాటి లక్ష్యం దిశగా..

ఆదిత్య ఎల్ 1 అప్డేట్.. భూమి ప్రభావాన్ని దాటి లక్ష్యం  దిశగా..

ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్  గమ్యం దిశగా సాగుతోంది.  తాజాగా ఆదిత్య ఎల్ 1 మిషన్  భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా  ఇస్రో ప్రకటించింది. ఆదిత్య ఎల్ 1  'స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్ ను  దాటినట్లుగా ఇస్రో వెల్లడించింది. ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆదిత్య ఎల్ 1  9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమి ప్రభావం ఉండే ఈ ప్రాంతాన్ని దాటేసిందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్  భూమి, సూర్యుడికి మధ్యలో ఉండే లాంగ్రేజ్ పాయింట్ దిశగా వెళ్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో చరిత్రలో రెండు స్పేస్ క్రాఫ్టులు మాత్రమే ఎర్త్ ఇన్ఫూయెన్స్ ని దాటి వెళ్లాయి. ఇందులో ఒకటి  మంగళయాన్  కాగా.. రెండోది ఆదిత్య ఎల్ 1 మిషన్. 

Also Read :- ఆర్‌బీఐ కీలక నిర్ణయం

సెప్టెంబర్ 2న నెల్లూరులోని  శ్రీహరికోటన్ నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ఆదిత్య ఎల్1ను ఇస్రో ప్రయోగించింది. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి తగిన వేగం పొందేందుకు ఆదిత్య ఎల్ 1 మిషన్  పలుమార్లు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరిగింది. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ఐదుసార్లు ఆదిత్య ఎల్ 1 కక్ష్యను పెంచారు. దీంతో  అనుకున్న వేగం సాధించిన ఎల్ 1 పాయింట్ వద్దకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.