బాలసాహిత్యభేరీలో ఆదివాసీ చిన్నారి : పీవో రాహుల్

బాలసాహిత్యభేరీలో ఆదివాసీ చిన్నారి : పీవో రాహుల్
  • ప్రశంసించిన ఐటీడీఏ పీవో రాహుల్​ 

భద్రాచలం, వెలుగు :  నవంబర్​ 30న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ప్రపంచ సాహిత్య వేదిక ఆన్​లైన్​లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలసాహిత్యభేరీ అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో భద్రాచలంలోని ఓ స్కూల్​ విద్యార్థిని మడవి గురుత్వ సమందా సింగ్​ కథా విభాగంలో పాల్గొన్నారు. 13 గంటల పాటు జరిగిన ఈ సమ్మేళనంలో పేన్​పండూం అడవి రహస్యం కథ ద్వారా ఆకట్టుకున్నారు. 

అంతర్జాతీయ వేదికలో ఆదివాసీ ప్రతినిధిగా ఆదివాసీ వేషధారణలో పాల్గొని ఆదివాసీ చారిత్రక సంప్రదాయ పేన్​ పండగ ఔన్నత్యాన్ని అద్భుతంగా కథారూపంలో ప్రదర్శించినందుకు ఐటీడీఏ పీవో రాహుల్​ చిన్నారిని గురువారం ప్రశంసించారు. తానా ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని చిన్నారికి అందజేశారు. తర్వాత స్వయంగా పీవో చిన్నారితో కథ చెప్పించి విన్నారు.