రాష్ట్ర ప్రాజెక్టుల్లో అడోబ్​ సిస్టమ్స్ భాగస్వామ్యం

రాష్ట్ర ప్రాజెక్టుల్లో అడోబ్​ సిస్టమ్స్ భాగస్వామ్యం
  •  సీఎం రేవంత్​తో భేటీలో  సీఈవో శంతను నారాయణ్‌‌‌‌‌‌‌‌ వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పెట్టుబడులే  లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా  ప్రఖ్యాత అడోబ్​ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌‌‌‌‌‌‌‌తో రేవంత్​ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్​ఆసక్తి కనబరిచారు. 

రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్‌‌‌‌‌‌‌‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.