కబ్జాల నుంచి భూములను కాపాడండి.. కలెక్టరేట్ ఎదుట అద్రాస్ పల్లి గ్రామస్తుల నిరసన

కబ్జాల నుంచి  భూములను కాపాడండి.. కలెక్టరేట్ ఎదుట అద్రాస్ పల్లి గ్రామస్తుల నిరసన

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారంటు మూడు చింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కబ్జాదారులపై చర్యలు తీసుకొని అద్రాస్ పల్లిలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.

అద్రాస్ పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 235లో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురవుతోందంటూ గతంలో కలెక్టర్ కు, తహశీల్దార్ కు చాలాసార్లు ఫిర్యాదులు చేశామన్నారు.  ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా  పట్టించుకోలేదని చెప్పారు. ఉన్ననా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ వేడుకున్నారు.

అనంతరం అద్రాస్ పల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గౌతమ్,అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా తీసుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఫిర్యాదు చేస్తామని చెప్పారు.