40 శాతం డిస్కౌంట్ఆఫర్ పేరుతో మోసం .. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

40 శాతం డిస్కౌంట్ఆఫర్ పేరుతో మోసం .. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

ఆర్మూర్, వెలుగు : ముందస్తు ఆర్డర్స్​ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పిన ఓ ట్రేడర్స్ బాగోతం ఆర్మూర్​లో వెలుగు చూసింది. ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్​ కెనాల్​ పక్కన జిరాయత్ నగర్ కు వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన ఇటీవల ఓ ట్రేడర్స్ ఏర్పాటైంది. ఫర్నిచర్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్​ వంటి వాటికి 40 శాతం డిస్కౌంట్​ఆఫర్ అంటూ విస్తృత ప్రచారం చేశారు. దీంతో అనేకమంది ముందస్తుగా డబ్బులు చెల్లించి ఆర్డర్​ చేసుకున్నారు.

 తీరా వారు స్టాక్ డెలివరీ చేస్తామన్న తేదీ దగ్గరకు వచ్చినా తామిచ్చిన ఆర్డర్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. షాప్​ క్లోజ్ ఉండటం,  ఓనర్స్​కు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, వారం రోజులు గడిచినా షాపు తీయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆర్మూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణగౌడ్​ తెలిపారు.