లండన్ : భారత్ చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్చేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును కూడా రెడీ చేసింది.
ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్కు చేరుకుంటుందని వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును రూ.20 లక్షలు (24,300 డాలర్లు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా బస్సు లండన్ కు చేరుకుంటుంది. టూర్ ప్యాకేజీలో భాగంలో టికెట్ బుక్ చేసుకున్న వారికి రోజూ బ్రేక్ఫాస్ట్తో పాటు 30 రోజుల పాటు లంచ్, డిన్నర్ వసతిని కల్పిస్తారు. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్లో డబుల్ షేరింగ్ రూమ్స్ను కేటాయిస్తారు.