ఇస్తాంబుల్​ టు బ్రిటన్​.. లగ్జరీ బస్సు జర్నీ

ఇస్తాంబుల్​ టు బ్రిటన్​.. లగ్జరీ బస్సు జర్నీ

లండన్​ : భారత్ చెందిన ప్రముఖ టూర్​ ఆపరేటింగ్​ కంపెనీ ‘అడ్వెంచర్స్​ ఓవర్​ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది.  ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్​ను రిలీజ్​చేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్​ నుంచి బ్రిటన్​ రాజధాని లండన్ వరకు దాదాపు 12వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును కూడా రెడీ చేసింది.

ఆగస్టు 7న ఇస్తాంబుల్​ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్​కు చేరుకుంటుందని వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్​ రేటును రూ.20 లక్షలు  (24,300 డాలర్లు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది.  బాల్కన్స్​, తూర్పు యూరప్​, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ​ప్రాంతాల మీదుగా బస్సు లండన్ కు చేరుకుంటుంది. టూర్​ ప్యాకేజీలో భాగంలో  టికెట్​ బుక్​ చేసుకున్న వారికి రోజూ బ్రేక్​ఫాస్ట్​తో పాటు 30 రోజుల పాటు లంచ్​, డిన్నర్​ వసతిని కల్పిస్తారు. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్​లో డబుల్​ షేరింగ్ రూమ్స్​ను కేటాయిస్తారు.