- ఎస్హెచ్ఆర్సీకి అడ్వకేట్ రామారావు విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: దక్షిణాఫ్రికాలోని మాలిలో తెలంగాణ యువకుడు ప్రవీణ్ కిడ్నాప్కు గురైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. తిరుగుబాటుదారుల చెరలో ఉన్న ప్రవీణ్ ను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమ్మానేని కమిషన్ను కోరారు.
ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెం ట్స్ ముకేశ్ కౌశిక్ను మాలి ఎంబసీతో సమన్వయం చేయాలని, ప్రవీణ్ విడుదలకు అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ను అభ్యర్థించారు.

