కాకతీయ కాలువలో అడ్వకేట్​ గల్లంతు

కాకతీయ కాలువలో అడ్వకేట్​ గల్లంతు

తిమ్మాపూర్, వెలుగు :  కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ ప్రధాన కాలువలో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అడ్వకేట్​ ద్యావనపల్లి వేణుగోపాల్ రావు గల్లంతయ్యాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేణు బుధవారం తన పిల్లలకు టిఫిన్ బాక్స్  ఇచ్చేందుకు పారమిత స్కూల్​కు వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు. 

దీంతో  కుటుంబ సభ్యులు వెతికారు. కాకతీయ కాలువ వద్ద టూవీలర్​తో పాటు చెప్పులు, మొబైల్ ఉన్నట్టు తెలుసుకొని వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో  కాలువలో  అతడి కోసం  గాలిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.