పంజాగుట్ట,వెలుగు : రూల్స్ బ్రేక్ చేసిన ఆఫ్టర్9 పబ్నుఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. మరో 32 మందిని అరెస్ట్ చేసినట్లు అమీర్పేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పటేల్బానోత్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తనిఖీలు చేయగా 29 కేసుల్లో 505 లీటర్ల మద్యం,(63.7)లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుని 32 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
మరో 20 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ఆదేశాల మేరకు.. ఆదివారం సాయంత్రం 5 గంటలనుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ముగిసేవరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు.
