మొన్న దీపికా.. ఇవాళ బన్నీ.. సందీప్ వంగా సినిమా నుంచి అల్లు అర్జున్ ఔట్..?

మొన్న దీపికా.. ఇవాళ బన్నీ.. సందీప్ వంగా సినిమా నుంచి అల్లు అర్జున్ ఔట్..?

టాలీవుడ్ బడా హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రోజుకో పుకారు షికారు చేస్తోంది. త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమా నుంచి బన్నీ తప్పుకున్నాడని, తాజాగా ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి గాసిప్ తాజాగా మరొకటి ప్రచారంలోకి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు.

అల్లు అర్జున్ను ఈ సినిమాలో తగిన హీరోగా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా భావించడం లేదని.. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఔట్ అని సినీ సర్కిల్స్లో పుకారు షికారు చేస్తోంది. 2024లో సందీప్ రెడ్డి వంగా బన్నీకి ఈ కథ వినిపించాడు. బన్నీకి ఈ కథ నచ్చడంతో ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నారు. కానీ.. కారణాలేంటో తెలియదు గానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించకపోవచ్చనే టాక్ నడుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ బదులు ఎన్టీఆర్ను హీరోగా అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే.. ఇది ప్రస్తుతానికైతే సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో సందీప్ గానీ, బన్నీ గానీ చెప్తేనే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి.. హీరో ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేను తొలగించి ఆమె స్థానంలో ‘యానిమల్’ భామ తృప్తి డిమ్రికి ఈ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీని కూడా కాదనుకున్నాడనే ప్రచారం సందీప్ ఇమేజ్ను ఎవరో పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తున్నారేమోననే అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో ఫుల్ బిజీ ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడుగా కీర్తించే సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్. ఈ సినిమాలో తొలుత బన్నీని హీరోగా అనుకున్నారు. కానీ.. హీరో ఎన్టీఆర్ అని క్లారిటీ వచ్చేసింది.

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో మరో సినిమా రాబోతోంది. నిర్మాత నాగవంశీ బుధవారం ఇందుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చారు. ‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ బ్రదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని షేర్ చేశారు. పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడుగా కీర్తించే సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది.