
తప్పుడు ఇండియా మ్యాప్ను పోస్ట్ చేసిన వాట్సాప్పై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, వ్యాపారాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారో, ఆ దేశానికి చెందిన సరైన మ్యాప్ను ఉపయోగించాలని హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా ఈ పొరపాటును సరిదిద్దాలని సూచించారు.
జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ ఇటీవల తన ట్విటర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో పెట్టిన భారత దేశ మ్యాప్లో జమ్మూకశ్మీరు విషయంలో పొరపాటు చేశారు. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ మ్యాప్ విషయంలో జరిగిన పొరపాటును సాధ్యమైనంత త్వరగా సరిదిద్దాలని వాట్సాప్ను ఆదేశించారు. భారత్లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, ప్లాట్ఫామ్స్ తప్పనిసరిగా సరైన మ్యాప్లను ఉపయోగించాలని సూచించారు.
కేంద్ర మంత్రి ట్వీట్ పై స్పందించిన జూమ్ సీఈఓ యువాన్ తన అకౌంట్ నుంచి వివాదాస్పద ట్వీట్ను తొలగించారు. మ్యాప్ విషయంలో సమస్యలు ఉన్నాయని చాలా మంది అభ్యంతరాలను లేవనెత్తడంతో తాను తన ట్వీట్ను తొలగించానని చెప్పారు. మ్యాప్ విషయంలో సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.