ఖుషి మ్యూజిక్ మెప్పిస్తుంది : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

ఖుషి మ్యూజిక్ మెప్పిస్తుంది : సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన తెలుగు చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ  చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ ‘నా మలయాళ హిట్ ఫిల్మ్ ‘హృదయం’ రిలీజైన తర్వాత మైత్రీ సంస్థ నుంచి పిలుపు వచ్చింది.

‘ఖుషి’ సినిమాకు వర్క్ చేయమని అడిగారు. శివ గారు చెప్పిన కథ విన్నాక ఒక బ్యూటిఫుల్ మూవీకి వర్క్ చేయబోతున్నా అని అర్థమైంది. వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశా. ఈ మూవీకి పనిచేయడం  థ్రిల్లింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఇచ్చింది. వర్క్ మొదలైనప్పటి నుంచి  కంప్లీట్ చేసేవరకు ఎక్సయిటింగ్‌‌‌‌గా జర్నీ సాగింది. దీనికోసం వీణ, సితార్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాం.  నా రోజా నువ్వే పాట నుంచి రీసెంట్‌‌‌‌గా రిలీజ్  చేసిన ఓసి పెళ్లామా వరకు అన్ని పాటలు బాగా కుదిరాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మ్యూజిక్ మెప్పిస్తుంది. ఇందులో సమంత, విజయ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. శివకు మ్యూజిక్‌‌‌‌పై చాలా ప్యాషన్ ఉంది. అందుకే అన్ని పాటలకు తనే స్వయంగా లిరిక్స్ రాశారు. కచ్చితంగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక టాలీవుడ్‌‌‌‌లో నాకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రానికి సంగీతం అందిస్తున్నా. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నా.  అన్ని జానర్స్ మూవీస్‌‌‌‌కు మ్యూజిక్ చేయాలనుకుంటున్నా’ అని చెప్పాడు.