రెండు రోజులు జనగామ మార్కెట్ కు సెలవులు : ఏఎంసీ చైర్మన్ బనుక శివ రాజ్యాదవ్

రెండు రోజులు జనగామ మార్కెట్ కు సెలవులు : ఏఎంసీ చైర్మన్ బనుక శివ రాజ్యాదవ్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ మార్కెట్​కు శుక్ర, శనివారాల్లో సెలవులు ప్రకటించినట్లు ఏఎంసీ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్​ తెలిపారు. యార్డులో వ్యాపారస్తులు కొనుగోలు చేసిన సరుకు తరలించేందుకు వాహనాలు  అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి మార్కెట్​ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.