ఎల్బీనగర్, వెలుగు: దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలోనూ మనం విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రీడ)లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ వర్చువల్గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రైతులతో పాటు కిషన్రెడ్డి హాజరయ్యారు. ప్రధాని మీటింగ్ అయిపోయిన తర్వాత కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు మనం పాల ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు అదే దేశానికి ఎగుమతి చేసే స్థాయికి చేరామన్నారు. దేశంలోని 10 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒకేసారి రూ.21 వేల కోట్లను రైతుల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత 8 ఏండ్లుగా ప్రధాన మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పని చేస్తున్నారని, కానీ మన సీఎం కేసీఆర్ మాత్రం సచివాలయానికి రారని, ఫామ్హౌస్ నుంచే పాలన సాగిస్తున్నారని అన్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయనీయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. ఈ పథకం కింద పేద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ను ఏ రాష్ట్రంలోనైనా తీసుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని తెచ్చిందని చెప్పారు. రామగుండం ఫ్యాక్టరీని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినయ్
- హైదరాబాద్
- June 1, 2022
లేటెస్ట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- తెలంగాణకు స్పెషల్ మ్యానిఫెస్టోను రిలీజ్ చేయనున్న కాంగ్రెస్
- బిగ్ ట్విస్ట్ : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్
- బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్ : తండ్రికి బిస్కెట్.. కొడుక్కి టికెట్!
- Satya dev's Krishnamma: ఒక్క ట్రైలర్తో అంతా మారిపోయింది.. కృష్ణమ్మపై అంచనాలు పెరుగుతున్నాయి
- శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
- కోవీషీల్డ్ వ్యాక్సిన్తో హెల్త్ రిస్క్: సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్
- Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా.. పోస్టర్పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు