- అగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్
బీర్కూర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అగ్రోస్ చైర్మన్ బాల్రాజ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మేకల విఠల్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు.
గ్రామల్లో మౌలిక వసతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. రఘు, గంగాధర్, బస్వరాజ్ పటేల్, విజయ్ ప్రకాశ్, రాములు, శశికాంత్, సందీప్ పటేల్ పాల్గొన్నారు.

