
ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు బ్రహ్మంగారు అపుడే చెప్పెను అంటుంటారు.. ఈ కాలంలో మాత్రం జ్యోతిష్యులు చెబుతున్నారు.. మేం అపుడే చెప్పాం అంటుంటారు.. సాక్ష్యానికి సోషల్ మీడియా పోస్టులు తెరపైకి వస్తాయి.. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత.. ఇలాంటి ప్రిడిక్షన్ తెరపైకి వచ్చింది. రావటమే కాదు.. #ArtOfPrediction.. ఆర్ట్ ఆఫ్ ప్రిడిక్షన్ పేరుతో ట్రెండ్ అవుతుంది.
జ్యోతిష్య నిపుణురాలు శర్మిష్ఠ తెలిపిన వివరాల ప్రకారం గురుడు మిధునరాశిలో.. మృగశిర.. ఆరుద్ర నక్షత్రాలతో కలిసి.. 6.5 డిగ్రీల వేగంతో గురు గ్రహం మీదుగా సంచరించే సమయంలో విమాన ప్రమాదాలు జరుగుతాయి.. విమానయాన రంగం అభివృద్ది చెందుతుంది. భద్రత పరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని 2024, డిసెంబర్ 29వ తేదీన ట్విట్ చేశారు శర్మిష్ఠ.
Aviation sector will do better in 2025, also plane crash headlines may give us shock, predicted this two months back, check the tweet below. Already a bit betterment in aviation sector started. When Jupiter will be in Gemini part of Mrigashira & Ardra with the speed of approx…
— Astro Sharmistha (@AstroSharmistha) December 29, 2024
ఆ ట్విట్ కు అనుగుణంగా.. ఇప్పుడు అహ్మదాబాద్ లో అతి పెద్ద విమాన ప్రమాదం జరగటంతో.. ఇది చర్చనీయాంశం అయ్యింది. అదే విధంగా భవిష్యత్తులో టాటా గ్రూప్ హైదరాబాద్లో రాఫెల్ జెట్ను డిజైన్ చేస్తుందని.. రాబోయే రెండేళ్లలో అంతరిక్ష పర్యాటకం.. ఉపగ్రహం టెక్నాలజీతో ఇస్రో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని జ్యోతిష్యురాలు శర్మిష్ఠ జూన్5న ట్వీట్లో రాశారు. నక్షత్రాలు, గ్రహాలు, విమాన రవాణా ఆధారంగా తాను ఇప్పటికే ఈ అంచనాలన్నింటినీ చేశానని ఆమె చెప్పారు.
Tata will make Rafale fuselage in Hyderabad. This is just aviation expansion, ISRO will surprise the world in Space and satellite engineering, space tourism in coming two years. Predicted this last year via Nakshatra transit. I am still holding high the prediction of Plane crash… https://t.co/WjX39R7E47
— Astro Sharmistha (@AstroSharmistha) June 5, 2025
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో #ArtOfPrediction హ్యాష్ట్యాగ్ ట్రెండ్అవుతుంది. ఒక యూజర్ మాట్లాడుతూ.. నక్షత్రాలు నిజంగా మన విమానాల మార్గాన్ని నిర్ణయిస్తున్నాయా?" అని వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్.. ఇంత ఖచ్చితంగా భవిష్యత్తును ఎలా అంచనా వేశారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను నక్షత్రాలు.. రాశులు.. గ్రహాల గురించి భయపడుతున్నానని రాసుకొచ్చారు.
మరికొందరు అయితే విమాన ప్రమాదం నిజం అయ్యింది అంటున్నారు.. దేశంలో దరిద్రం ఎప్పుడు పోతుంది.. అందరికీ ఉద్యోగాలు వచ్చే రోజు వస్తుందా అంటూ కామెంట్ చేస్తున్నారు..