- నో మోర్ డ్రాపవుట్ పేరిటడాక్యుమెంటరీ
- శెట్పల్లి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చొరవ
కామారెడ్డి, వెలుగు: చదువు పట్ల స్టూడెంట్స్లో ఆసక్తి పెంచేందుకు, పాఠాలు ఈజీగా అర్థమయ్యేలా చేసేందుకు ప్రైమరీ స్కూళ్లలో ప్రారంభించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) క్లాసులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏఐ బోధన జరుగుతున్న స్కూళ్లలో స్టూడెంట్స్ రెగ్యులర్గా వస్తుండడంతో అటెండెన్స్ మెరుగయ్యింది. డ్రాప్ అవుట్స్ కూడా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని శెట్పల్లి కాంప్లెక్స్ స్కూల్ పనితీరు ఆధారంగా ‘నోమోర్ డ్రాప్ అవుట్’పేర డాక్యుమెంటరీ తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకునేందుకు ప్రైమరీ స్కూల్స్లో ప్రభుత్వం ఏఐ క్లాసులు నిర్వహిస్తోంది.
కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 27 ప్రైమరీ స్కూల్స్ను ఎంపిక చేశారు. ఏఐ విధానం పట్ల పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్లాస్లు కొనసాగుతున్న చోట్ల స్టూడెంట్స్ రెగ్యులర్గా వస్తున్నారు. డ్రాపవుట్స్ తగ్గాయి. కంప్యూటర్ ద్వారా మ్యాథ్స్, తెలుగు లాంటి సబ్జెక్టులు చెప్తున్నారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఏఐ ద్వారా పాఠాలు చెప్పటంతో సులభంగా నేర్చుకుంటున్నారు. 3,4,5 తరగతుల స్టూడెంట్స్కు రోజు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలు క్లాస్ఉంటుంది. గతంలో కొన్ని ప్రైమరీ స్కూల్స్లో అటెండెన్స్ అంతంతమాత్రంగా ఉండేది. ఇప్పుడు ఏఐ క్లాసులతో స్టూడెంట్స్ రోజూ వస్తున్నారు.
శెట్పల్లి స్కూల్ ఆధారంగా డాక్యుమెంటరీ
శెట్పల్లి కాంప్లెక్స్ స్కూల్ పరిధిలోని ప్రైమరీ స్కూల్లో ఏఐ క్లాస్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 66 మంది స్టూడెంట్స్ ఉన్నారు. గతంలో ఈ స్కూల్కు విద్యార్థులు రెగ్యులర్గా వచ్చేవారు కాదు. ఏఐ క్లాస్లు పాఠాలు ఈజీగా నేర్చుకునే అవకాశం ఉండడంతో స్టూడెంట్స్ డుమ్మా కొట్టడంలేదు. స్కూలు మానేసిన ఇద్దరు స్టూడెంట్లు కూడా ఏఐ విధానం పట్ల ఆసక్తితో తిరిగి బడికి వస్తున్నారు. స్టూడెంట్లలో చదువు మీద పెరిగిన ఆసక్తి, డ్రాపవుట్ లేకపొవటం తదితర అంశాలను హైలెట్ చేస్తూ నో మోర్ డ్రాపవుట్స్ పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఇందుకోసం హైస్కూల్ హెచ్ఎం వసుధ రూ. 50వేలు ఖర్చు చేశారు. ఎక్కపల్లి ప్రైమరీ స్కూల్లో పని చేస్తున్న అఖిల్ ఏఐ క్లాస్లకు స్టేట్ రిసోర్స్పర్సన్గా ఉన్నారు. ఈయనే డాక్యుమెంటరీకి డైరెక్టర్గా వ్యవహరించారు.
ఈస్కూళ్లలో ఏఐ క్లాస్లు
లింగంపేట మండలం శెట్పల్లి, మోతె తండా, పోతాయిపల్లి, బాన్సువాడ మండలం తాడ్కోల్, హన్మాజిపేట, బొల్లారం, బీబీపేట మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి, జుక్కల్ మండలంలో హంగర్గ, బిచ్కుంద మండలంలో హస్కుల్, గుండెనెమ్లి, జామ మసీద్, నస్రుల్లాబాద్ మండలంలో బోమ్మ దేవునిపల్లి, మహమ్మద్నగర్ మండలం కొమలంచ, రాజంపేట మండలంలో బసన్నపల్లి, రాజంపేట, రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా , మద్దికుంట, సదాశివనగర్ మండలం కుప్రియాల్, పద్మాజీవాడి, మర్కల్, తాడ్వాయి మండలం కన్కల్, కరడ్పల్లి, చిట్యాల, ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలోని ప్రైమరీ స్కూల్స్లో ఏఐ క్లాస్లు నిర్వహిస్తున్నారు. హైస్కూల్స్లో ఉన్న కంప్యూటర్లను ఏఐ క్లాసులకు వాడుకోవాలని భావించిన అధికారులు తొలివిడతలో హైస్కూల్స్ కాంపౌండ్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్నే ఏఐ క్లాస్లకు సెలక్టు చేశారు. త్వరలో ప్రైమరీ స్కూల్స్కు కంప్యూటర్లు మంజూరు చేసే అవకాశముంది.
మార్పులు గమనించి డాక్యుమెంటరీ తీశాం
ఏఐ క్లాస్లతో విద్యార్థుల్లో మార్పులు వస్తున్నాయి. సబ్జెక్టును సులభంగా నేర్చుకుంటున్నారు. వారి సామర్థ్యాలను ఆధారం చేసుకొని పాఠాలు వస్తుండటంతో వారిలో ఆసక్తి పెంచుతుంది. రెగ్యులర్గా విద్యార్థులు స్కూల్కు రావటాన్ని గమనించాం. దీని ఆధారంగానే డాక్యుమెంటరీ తీశాం. ఇందుకోసం సొంతంగా రూ. 50వేలు ఖర్చు చేశా. - వసుధ, హెచ్ఎం , శెట్పల్లి
విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది
ఏఐ బోధన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఇబ్బంది పడకుండా విషయాలను నేర్చుకుంటున్నారు. రెగ్యులర్ క్లాస్లో అందరినీ దృష్టిలో పెట్టుకొని టీచర్లు క్లాస్లు చెబుతారు. కానీ ఏఐలో అలా ఉండదు. ఆ విద్యార్థి సామర్థ్యాన్ని పసిగట్టి దాని ఆధారంగానే సులభంగా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన మార్పు మిగతావాళ్లకూ స్ఫూర్తి కావాలని నో మోర్ డ్రాపవుట్ పేరిట డాక్యుమెంటరీ తీశాం.- అఖిల్ , స్టేట్ రిసోర్స్ పర్సన్
