
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రస్తుతం టెక్ రంగాన్ని ఏలుతున్న బూమ్. AI రాకతో టెక్నాలజీ రంగంలో అనేకమంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. AI తో ఇక ముందుకూడా ఉద్యోగులకు, కొత్త గా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవారికి ప్రమాదమే అంటున్నారు సాఫ్ట్ వేర్ ప్రముఖులంతా..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో ఉద్యోగాలకు ముప్పు ఉందని కొత్త టెకీలకు వార్నింగ్ ఇస్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల.
ఇటీవల ఓ పాడ్ కాస్ట్ మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్లు ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి తన సలహాలు, సూచనలు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఇతర టెక్ కంపెనీలు క్రమంగా AI వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది టెక్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి ఆందోళన కలిగిస్తున్న క్రమంలో..ఆందోళన చెందాల్సిన అవసరంలేదు..AI స్కిల్స్ పెంచుకోవడం ద్వారా AI ని వినియోగించుకోవాలని చెబుతున్నారు సత్యనాదెళ్ల.
AI లో ఉద్యోగాలు పోతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయం కదా అన్న ప్రశ్నకు.. AI కోడింగ్ రాయడంలో సాయం చేస్తుంది.కంప్యూటేషనల్ థింకింగ్" ,"సిస్టమ్ డిజైన్" వంటి సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ పై పట్టు సాధించడం చాలా ముఖ్యమన్నారు నాదెళ్ల . AI ఏమి రాయాలో చెప్పే మానవ తార్కిక ఆలోచనకు తిరుగులేదని అన్నారాయన.
AI మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదు.. అది ఒక శక్తివంతమైన సాధనం మాత్రమే.. మైక్రోసాఫ్ట్లో సుమారు 30శాతం కోడింగ్ AI ద్వారా జరుగుతున్నప్పటికీ, మానవ ఇన్పుట్,పర్యవేక్షణ ఇప్పటికీ చాలా అవసరం అన్నారు సత్య నాదెళ్ల.
AI టూల్స్ సంక్లిష్ట సిస్టమ్లను నిర్మించడానికి వేగవంతమైన మార్గాన్ని అందిస్తున్నందున భవిష్యత్తులో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఆర్కిటెక్టులు అవసరమవుతారని, ఇంజనీర్లకు బదులుగా త్వరలో మనకు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ల సైన్యం రాబోతుందన్నారు. AI భారీ పని చేయడానికి,మానవులు ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి మార్గాన్ని నిర్మిస్తారని అన్నారాయన. మనమందరం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లుగా మారబోతున్నాం అని అన్నారు సత్యానాదెళ్ల.