బీజేపీ పాలనతో దేశం ప్రమాదంలో పడింది: దీపాదాస్

బీజేపీ పాలనతో దేశం ప్రమాదంలో పడింది:  దీపాదాస్

అయోధ్య రామ మందిర విషయంలో ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఉంటాయని.. బీజేపీ పాలనలో భారతదేశం ప్రమాదపు అంచున ఉందని ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షి అన్నారు. జనవరి 18వ తేదీ గురువారం సికింద్రాబాద్ ఓ హోటల్లో మైనారిటీ క్రిస్టియన్స్ ఏర్పాటు చేసిన మీటింగ్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సమావేశంలో  వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన బిషబ్ లు..పాదర్స్ తోపాటు క్రిస్టియన్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ... అయోధ్య రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని, రామ మందిరం దర్శించుకోవడానికి ప్రత్యేకమైన రోజు ఏమీ ఉండదన్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిరంలో కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారని, కాంగ్రెస్ పార్టీ అందరి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణ లో 17 పార్లమెంట్ స్థానాలలో గెలుస్తామని దీపా దాస్ మున్షి ఆశాభావం వ్యక్తం చేశారు.