ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా?

ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా?

బీజేపీ పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక  కోసం ఆ పార్టీ ఇంత బరితెగించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన అసదుద్దీన్ రాష్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.

హైదరాబాద్ లో దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలోనుంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా? అని బీజేపీ నేతలను అసదుద్దీన్ ప్రశ్నించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.  బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి రాష్ట్రం విముక్తి పొందాలని ఆశిద్దామంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.