
ముంబై: ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐసీ129) 3 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. ముంబైకి తిరిగి వచ్చింది. ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. ఈ విమానం ఉదయం 5:39 గంటలకు చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. అయితే, ఇరాన్,- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో ఈ విమానం మధ్యలో నుంచే వెనక్కి వచ్చింది.
ఇరాన్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశం తన గగనతలాన్ని మూసివేయడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లించామని, మరికొన్నింటిని బయలుదేరిన ఎయిర్పోర్టులకే తిరిగి వెనక్కి రప్పిస్తున్నామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.