ఇరాన్‌ గగనతలాన్నిఉపయోగించొద్దు: భారత్

ఇరాన్‌ గగనతలాన్నిఉపయోగించొద్దు: భారత్

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడులు చేసింది. తీవ్ర ప్రతీకార దాడి తప్పదని ఇరాక్, ఇరాన్ ప్రకటన చేసినా లెక్కచేయకుండా అమెరికా మరోసారి దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్‌ వెళ్లే విమానాలను విమానయాన సంస్థలు తాత్కాలికంగా దారి మళ్లించే అవకాశాలున్నాయి. దీంతో విమానయాన సంస్థలపై అదనపు భారం పడనుంది.