న్యూఢిల్లీ: 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా టాటాల గూటికి గురువారం నాడు చేరుతోంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను నేడు టాటాలకు ప్రభుత్వం అప్పచెబుతోంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం బిడ్స్పిలిచిన విషయం తెలిసిందే. అందరికంటే ఎక్కువగా రూ. 18 వేల కోట్లకు టాటా గ్రూప్ బిడ్ వేసింది. టాటా గ్రూప్లోని ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్ను దాఖలు చేసింది. దీంతో కిందటేడాది అక్టోబర్ 8 న ఈ కంపెనీకే ఎయిర్ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పైలట్లకు చెల్లించాల్సిన బకాయిలలో భారీగా కోత విధించడంతో లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు మరోవైపు రెండు పైలట్ యూనియన్లు ఎయిర్ ఇండియా సీఎండీ విక్రమ్ దేవ్ దత్కు వార్నింగ్ ఇచ్చాయి. ఈ కోత చట్ట విరుద్ధమని, వెంటనే సరి చేయాలని రెండు యూనియన్లు కోరుతున్నాయి. ఈ మేరకు సీఎండీకి ఒక లెటర్ను పంపాయి. బాడీ మాస్ ఇండెక్స్ కొలవాలనే కొత్త రూల్ను ఇంకో రెండు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫ్లైట్ ఎక్కేముందు ఎయిర్పోర్టులలో కేబిన్ సిబ్బంది బీఎంఐ కొలవాలనే రూల్ను తెస్తున్నట్లు ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ జనవరి 20 న ప్రకటించింది. డీజీసీఏ రూల్స్కు ఇది వ్యతిరేకమని యూనియన్లు వాదిస్తున్నాయి.
గ్రూప్లో మూడో ఎయిర్లైన్ కంపెనీ.....
ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు అమ్మేసినట్లు అక్టోబర్8 న ప్రకటించిన మూడు రోజుల తర్వాత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. అక్టోబర్ 25 న టాటా గ్రూప్తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో గురువారం టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియాను అప్పచెప్పనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎయిర్ ఇండియాతోపాటు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఎస్ఏటీఎస్లు కూడా టాటాల చేతికి రానున్నాయి. నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను ప్రైవేటు రంగానికే ప్రభుత్వం ఇచ్చేస్తోంది. ఎయిర్ ఇండియా చేతికి రావడంతో టాటా గ్రూప్లోని ఎయిర్లైన్ బ్రాండ్ల సంఖ్య మూడుకు చేరుతోంది. ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలలో ఇప్పటికే టాటా గ్రూప్కు మెజారిటీ వాటా ఉంది. సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్తో కలిసి టాటా గ్రూప్ఈ జాయింట్వెంచర్లను ఏర్పాటు చేసింది.