దేశీయ‌, విదేశీ విమాన టికెట్స్ బుకింగ్ ప్రారంభం

దేశీయ‌, విదేశీ విమాన టికెట్స్ బుకింగ్ ప్రారంభం

మే-3 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌డించ‌డంతో ఆ త‌ర్వాతి రోజు నుంచి విమాన‌యాన స‌ర్వీసులు కొనసాగుతాయో లేదో తెలియదు కానీ, బుకింగ్ మాత్రం ఓపెన్ చేశారు. ఈ క్ర‌మంలోనే దేశీయ‌, అంత‌ర్జాతీయ విమానాల‌కు.. ఎయిర్ ఇండియా బుకింగ్ ఓపెన్ చేసింది. మే 4వ తేదీ నుంచి సెలెక్ట్ చేసిన దేశీయ ప్రాంతాల‌కు మాత్ర‌మే ఎయిర్ ఇండియా ఆన్ లైన్ టికెట్ల‌ను అమ్ముతుంది. అంత‌ర్జాతీయ విమానాల‌ను మాత్రం చాలా నెమ్మ‌దిగా మ‌రో నెల ఆల‌స్యంగా ప్రారంభించింది.

జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ‌.. అంత‌ర్జాతీయ ఫ్ల‌యిట్ల‌కు విమాన టికెట్ల‌ను అమ్మ‌డం షురూ చేసింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి క్ర‌మంలో.. దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీంతో దేశీయ‌, అంత‌ర్జాతీయ విమానాల‌ను క్యాన్సిల్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మే 3వ తేదీ వ‌ర‌కు ఎటువంటి దేశీయ‌, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు ఉండ‌వ‌ని కూడా మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది ఎయిర్ ఇండియా.