ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అక్రమ ఇసుక దందాలు చేసే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మీసేవలో ఇసుక బుక్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర కార్మికశాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం (జూన్ 25) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.  

మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకొని.. వాటంన్నిటినీ పూర్తి చేస్తున్నానన్నారు. చెన్నూర్ మున్సిపాలిటీలో ప్రతీ వార్డుకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. రూ.30 కోట్ల నిధులతో అమృత్ పథకం ద్వారా మంచి నీరు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశామని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి స్కీములన్ని ఇంప్లిమెంట్ చేస్తు్న్నామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.  

కాళేశ్వరంతోచెన్నూరుకు బొట్టు నీళ్లు రాలె

కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృథా చేసిండని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టు వల్ల చెన్నూరు నియోజకవర్గంలో ఒక బొట్టు నీళ్లురాలేదన్నారు. నీళ్లు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేదన్నారు. కేసీఆర్ లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. ప్రాజెక్టు కూలిపోవడంతో మూడేండ్లుగా బొట్టు నీళ్లురాలేదు. ప్రాజెక్టు లేకున్న 70శాతం అధికంగా పంటలు పండించాం. కానీ బ్యాక్ వాటర్ వల్ల 40వేల ఎకరాలు ముంపుకు గురై రైతులు నష్టపోయారు. చెన్నూరు నియోజకవర్గంలో 3వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్స్ ఇచ్చాం. రానున్న రోజుల్లో మరో 14 వేల ఇండ్లు. వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికి మంజూరు చేస్త, ఎవరు ఆందోళన చెందవద్దు.' అని అన్నారు.