లండన్‌లో చదువాలన్నది ఆటో డ్రైవర్ బిడ్డ కల..నెరవేరకుండానే కబళించిన ఫ్లైట్ యాక్సిడెంట్

లండన్‌లో చదువాలన్నది ఆటో డ్రైవర్ బిడ్డ కల..నెరవేరకుండానే కబళించిన ఫ్లైట్ యాక్సిడెంట్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం..దేశచరిత్రలో అత్యంత విషాదం మిగిల్చిన ఘటన.270 మంది ప్రాణాలు కోల్పోయిన దురదృష్ట ఘటన.ఎయిర్ ఇండియా విమానం AI717 ప్రమాదానికి గురైన కొన్ని రోజుల తర్వాత అందులోని ప్రయాణికుల భావోద్వే గ కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే గుజరాత్ లోని హిమత్ నగర్ కు చెందిన యువతి పాయల్ ఖాతిక్ విషాదాంతం అందరినీ కలచివేసింది.

పాయల్ ఖాతిక్..తొలిసారి విమానం ఎక్కిన 21యేళ్ల యువతి.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241మంది ప్రయాణికులో ఆమె ఒకరు. ఆమె శవం కూడా ఇంకా గుర్తించలేదు.. అంత దయనీయ స్థితిలో చనిపోయింది. కన్న కలను  నెరవేర్చుకునేందుకు విదేశాలకు వెళ్తున్న పాయల్ ఖాతిక్ ని విమాన ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. 

బీటెక్ పూర్తి చేసిన పాయల్ ఖాతిక్.. లండన్ లో ఎంటెక్ చేయాలనేది ఆమె కల. ఆటోడ్రైవర్ కూమార్తె అయిన ఖాతిక్..ఎంతో కష్టపడి బీటెక్ పూర్తి చేసింది..ఉన్నత చదువులకోసం గురువారం(జూన్ 12) లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. టేకాఫ్ నిమిషాల్లో నే కూలిపోయిన విమానం మంటల్లో ఆమె కలలు కూడా బూడిదయ్యాయి. 

రిక్షా కార్మికుడి కుటుంబంలో విమానం ఎక్కిన తొలిసభ్యురాలు పాయల్ ఖాతిక్.. ఇంజనీరింగ్ ,టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రయాణిస్తోంది.ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమె కుటుంబం తమ ప్రియమైన కుమార్తెకు ప్రేమతో వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లిపోయింది. అయితే కొన్ని గంటల్లోనే పాయల్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందన్న వార్త ఆ కుటుంబాన్ని దుఖసాగరంలో ముంచేసింది. విమాన ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత DNA విశ్లేషణ ద్వారా పాయల్ మృతిచెందినట్లు నిర్ధారించారు ఫోరెన్సిక్ అధికారులు. 

ఏ కుటుంబం చెబుతుంది?

పాయల్ బీటెక్ పూర్తి చేసి లండన్ లో చదువుకోవాలనుకుంది. ఆమె కోరిక మేరకు అప్పు చేసి మరీ లండన్ కు పంపించాలని నిర్ణయించుకున్నామని.. విమాన ప్రమాదం తమ బిడ్డను దూరం చేసిందన్నా పాయల్ తల్లిదండ్రులు. భవిష్యత్ లో మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడానికి సాయపడుతున్నందని ఎందో ఆశతో అప్పులు చేశామని పాయల్ తండ్రి సురేష్ బోరున విలపించారు. 

మా కుటుంబంలో విదేశాలకు వెళ్లిన మొదటి సభ్యురాలు ఆమె.. ఉదయపూర్‌లో బీటెక్ పూర్తి చేసి లండన్ లో ఎంటెక్ చదివేందుకు వెళ్తోంది. ఇంతలో ఈ విషాద సంఘటన జరిగింది.పాయల్ మరణం చాలా బాధకలిగించిందని బంధువులు విలపించారు. 

తండ్రి ఆటో డ్రైవర్ గా  పనిచేస్తే వచ్చిన డబ్బులతో కుటుంబం గడిచేది. పాయల్ లండన్ వెళ్లేందుకు అప్పులు చేశారు ఆమె తండ్రి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అసరగా ఉంటుందనుకునే సమయంలో విమాన ప్రమాదంలో పాయల్ మృతిచెందడంలో ఆ కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.