అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. లండన్ వెళుతున్న 200 మందికి పైగా ప్రయాణికులు

అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. లండన్ వెళుతున్న 200 మందికి పైగా ప్రయాణికులు

అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే క్రాష్ అయింది. విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ‘ఎక్స్’లో కనిపించాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానంగా తెలిసింది.

అహ్మదాబాద్లోని మేఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి.  విమాన ప్రమాదాలు ఇటీవల కలవరపెడుతున్నాయి. టేకాఫ్ అయి గాల్లో ఎగురుతుండగా చెట్టును ఢీకొట్టి విమానం కూలినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆసుపత్రికి తరలించాయి.