
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ( జూన్ 13 ) ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో 16 విమానాలు దారి మళ్లించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. ఢిల్లీ, టొరంటో సహా ఇతర ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల నుండి 16 విమానాలను దారి మళ్లించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది ఎయిర్ ఇండియా.
ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. ఈ మేరకు దారి మళ్లించిన 16 విమానాల లిస్ట్ ను ఎక్స్ లో పోస్ట్ చేసింది ఎయిర్ ఇండియా.
దారి మళ్లించిన విమానాల లిస్ట్:
- AI130 – లండన్ హీత్రూ-ముంబై – వియన్నాకు మళ్లించబడింది
- AI102 – న్యూయార్క్-ఢిల్లీ – షార్జాకు మళ్లించబడింది
- AI116 – న్యూయార్క్-ముంబై – జెడ్డాకు మళ్లించబడింది
- AI2018 – లండన్ హీత్రూ-ఢిల్లీ – ముంబైకి మళ్లించబడింది
- AI129 – ముంబై-లండన్ హీత్రో – ముంబైకి తిరిగి వస్తున్నారు
- AI119 – ముంబై-న్యూయార్క్ – ముంబైకి తిరిగి వస్తోంది
- AI103 – ఢిల్లీ-వాషింగ్టన్ – ఢిల్లీకి తిరిగి వస్తున్నారు
- AI106 – న్యూవార్క్-ఢిల్లీ – ఢిల్లీకి తిరిగి వస్తున్నారు
- AI188 – వాంకోవర్-ఢిల్లీ – జెడ్డాకు మళ్లింపు
- AI101 – ఢిల్లీ-న్యూయార్క్ – ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లింపు
- AI126 – చికాగో-ఢిల్లీ – జెడ్డాకు మళ్లింపు
- AI132 – లండన్ హీత్రో-బెంగళూరు – షార్జాకు మళ్లించబడింది
- AI2016 – లండన్ హీత్రూ-ఢిల్లీ – వియన్నాకు మళ్లించబడింది
- AI104 – వాషింగ్టన్-ఢిల్లీ – వియన్నాకు మళ్లించబడింది
- AI190 – టొరంటో-ఢిల్లీ – ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించబడింది
- AI189 – ఢిల్లీ-టొరంటో – ఢిల్లీకి తిరిగి వస్తున్నారు
కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి.. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపింది ఎయిర్ ఇండియా. ఈ క్రమంలో ఉచిత రీషెడ్యూల్ లేదా రిఫండ్ అందిస్తున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.
కాగా.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఎటు చూసినా బాంబుల మోత.. ప్రజల ఆర్థనాధాలతో ధ్వనిస్తోంది. శుక్రవారం (జూన్ 13) తెల్లవారుఝాము నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాదులకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యూక్లియర్ కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఇరాన్ కు చెందిన ఇద్దరు కమాండర్లతో పాటు ఇద్దరు న్యూక్లియర్ కేంద్ర అధికారులు కూడా మృతి చెందడం సంచలనంగా మారింది.