ఎయిర్ ఇండియా నయా లుక్ లో వస్తోంది. కొత్త డిజైన్ లో వస్తున్న విమానం ఫోటోలను ఎయిర్ ఇండియా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx
— Air India (@airindia) October 6, 2023
ఫ్రాన్స్లోని టౌలౌస్లోని పెయింట్ షాప్లో పార్క్ చేసిన ఎయిర్ ఇండియా A350 విమానం చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ విమానాలు శీతాకాలంలో భారత్కు రానున్నట్లు తెలిపింది.
ఎయిర్ ఇండియాను ఇటీవల టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత అభివృద్ధిలో భాగంగా సరి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో విమాన లోగోతో పాటు డిజైన్ ను మార్చేసింది. లోగోలో ఎయిరిండియా ఫాంట్ను కూడా మార్చారని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తోంది. అలాగే ఎరుపు, ఊదారంగు వంటి సరికొత్త డిజైన్లతో విమానాలు కనువిందుగా కనిపిస్తున్నాయి.
ALSO READ : Gold Rates : నెల రోజుల్లో రూ. 2 వేలు తగ్గిన బంగారం.. ఇప్పుడెంతంటే
పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్ లోకి మార్చనుంది ఎయిర్ ఇండియా. దీని కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి ఎయిర్ ఇండియా విమానాలన్ని ఈ కొత్త లోగోలోకి మార్చనుంది.