భారతీయుల కోసం వుహాన్ కు జంబో ఫ్లైట్

భారతీయుల కోసం వుహాన్ కు జంబో ఫ్లైట్

చైనాను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. దీంతో అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ కు కేంద్రస్థానంగా భావిస్తున్న వుహాన్ నగరంలో ఎక్కువ సంఖ్యలో భారతీయులున్నారు. ఇప్పుడు వాళ్లందరినీ తీసుకొచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన భారీ విమానం జంబో  B747ను కేంద్రం చైనాకు పంపింది.

ఈ బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి ఇవాళ(శుక్రవారం) బయల్దేరింది. వుహాన్ నుంచి 400 మంది ఇండియన్లను ఈ విమానం ద్వారా భారత్ కు తరలిస్తారు. బి747 జంబో విమానం శనివారం వేకువజామున తిరిగి ఢిల్లీ చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 432 మంది ప్రయాణించే వీలుంది. శనివారం చైనాకు మరో విమానాన్ని పంపించనున్నారు. చైనా నుంచి భారత్ చేరుకోనున్న వ్యక్తులను 14 రోజుల పాటు ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యాధికారులు.