టెలికాం రంగంలో దూసుకెళ్తున్న ఎయిర్ టెల్… తన కస్టమర్ల కోసం కొత్తగా ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ ప్రవేశ పెట్టింది. ఈ భరోసా ఖాతా అండర్ బ్యాంకు, అన్ బ్యాంకు కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుంది. అంతేకాదు ఖాతా కింద రూ.5 లక్షల మేరకు ప్రమాద బీమాను కూడా కల్పించనుంది.
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాను రూ.500 నెలవారీ బ్యాలెన్స్ తో నిర్వహించవచ్చు. దీని కింద రూ.5 లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఫ్రీగా అందించనుంది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్ బ్యాక్ కూడా సదుపాయాన్నికూడా పొందవచ్చు.
ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమన్నారు ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు సీఎండీ అనుబ్రాతా బిస్వాస్. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అవుట్ లెట్లలో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు మినీ స్టేట్ మెంట్ను కూడా తీసుకోవచ్చని తెలిపారు.